ఆంధ్రప్రదేశ్
జంగారెడ్డిగూడెంలో ప్రమాదం


పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరో 22 మంది గాయపడ్డారు. వీరిలో 9 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
జంగారెడ్డిగూడెం బైపాస్ లో శ్రీనివాసపురం జంక్షన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గుబ్బలమంగమ్మ ఆలయానికి వెళ్తున్న ట్రాక్టర్ ని లారీ ఢీకొనడంతో ట్రాక్టర్ లో ఉన్నవారిలోొ ఇద్దరు చనిపోయారు. మరో 22 మందికి గాయపడ్డారు. బాధితులంతా కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనాలలో జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. వీరిలో 9 మంది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. మిగిలిన తొమ్మిది మంది జంగారెడ్డి గూడెం ఏరియా హాస్పిటల్ లో నే చికిత్స పొందుతున్నారు. జంగారెడ్డి గూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.